రానున్న లోక్సభ ఎన్నికలకు ఆయా పార్టీలు ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా ఉన్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకే సై అనేసింది. అయితే దీనిలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే మొత్తం ఏడు సీట్లలకు గాను ఆరుగురు అభ్యర్థుల పేర్లను పార్టీ వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందు సిద్దపడలేదు పొత్తులేకుండానే ఎన్నికల్లో పాల్గోంటామని తెల్చిచేప్పేసింది. కాగా ఈస్ట్ ఢిల్లీ నుంచి అతిషి, సౌత్ ఢిల్లీ నుంచి చద్దా, చాందినీ చౌక్ నుంచి పంకజ్ గుప్తా, నార్త్ఈస్ట్ ఢిల్లీ నుంచి దిలీప్ పాండే, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి గుగన్ సింగ్ ఆప్ తరుపున పోటీ చేయనున్నారు. అయితే ఏడు సీట్లకు గాను ఆరుగురి అభ్యర్థులను ఎంపీక చేసిన పార్టీ వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గ అభ్యర్థిని మాత్రం పార్టీ ప్రకటించలేదు. అయితే ఈ ఒక్క సీటు మాత్రం తరువాత ప్రకటిస్తాం అని తెలిపారు.