ఎంపీ టికెట్ కోసం మా నాన్న రూ.6 కోట్లు ఇచ్చారు..!

Update: 2019-05-11 15:24 GMT

సరిగ్గా ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఢిల్లీ అధికార ఆమాద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ సీటు కోసం తన తండ్రి రూ.6 కోట్లు చెల్లించారంటూ ఆప్ అభ్యర్థి బల్బీర్ సింగ్ జఖార్ కుమారుడు ఉదయ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌, ఆ పార్టీకి చెందిన నేత గోపాల్ రాయ‌ల్‌కు త‌న తండ్రి ఆ సొమ్మును చెల్లించార‌ని దీనికి సంబంధించి త‌న వ‌ద్ద ఆధారాలున్నాయ‌ని పేర్కొన్నాడు. సామాజికి కార్య‌క‌ర్త అన్నా హ‌జారే ఉద్య‌మంలో ఒక్క‌సారి కూడా క‌నిపించ‌డని, పార్టీతో సంబంధంలేని త‌న తండ్రికి కేజ్రీవాల్ టికెట్ ఎలా ఇచ్చార‌ని మీడియా స‌మావేశంలో ప్ర‌శ్నించాడు.  



Similar News