రైలు కింద పడి బతికి బయట పడ్డాడు ..

Update: 2019-06-20 05:02 GMT

మామూలుగా ఎవ‌రైనా రైలు కింద‌ ప‌డితే ఏం అవుతుంది. ఇంకేముంది..శాల్తీ కాస్తా తునాతున‌క‌లు అవుతుంది. శ‌రీరం ముక్కలు ముక్కలు అవ‌డం ఖాయం. కానీ ఒడిశా సంబల్పూర్‌లో ఓ విచిత్రమైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. రైలు కింద ప‌డ్డా బ‌తికిన అదృష్టం బాగుండి బతికి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు.రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి... పట్టుతప్పడంతో... ప్లాట్ ఫామ్ నుంచీ జారి... రైలు కింద పడ్డాడో ప్రయాణికుడు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులంతా గాబరా పడ్డారు. లక్కీగా అక్కడ రైలు చక్రాలకూ, ప్లాట్ ఫామ్‌కీ మధ్య కొంత గ్యాప్ ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. 

Tags:    

Similar News