స్విమ్మింగ్ పూల్లో పడి ఓ 5 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వశిష్ట అనే బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పూల్లో పడిపోయాడు. అక్కడ ఉన్నవారు గమనించే లోపు అ బాలుడు నీటిలో మునిగి చనిపోయాడు. ఐతే గేటెడ్ కమ్యూనిటి వారి నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయారంటున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.