తెలంగాణ హైకోర్టులో 12 మంది న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులు మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ ఇతర న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 12 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులు మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ ఇతర న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 12 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ మామిడాల సత్యరత్న శ్రీ రామచంద్ర రావు, జస్టిస్ అడవల్లి రాజేశేఖర్ రెడ్డి, జస్టిస్ పొనుగోటి నవీన్ రావు, జస్టిస్ చల్లా కోదండరామ్ చౌదరి, జస్టిస్ బులుసు శివ శంకర్ రావు, జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్, జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ తోడుపునూరి అమర్నాథ్ గౌడ్, జస్టిస్ వి.రామ సుబ్రహ్మణ్యన్ , ఆర్.ఎస్. చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు రాజ్భవన్లో తెలంగాణ చీఫ్ జస్టిస్గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు.