ఒంటరిగానే పోటీ చేస్తాం : అఖిలేష్ యాదవ్

Update: 2019-06-04 12:04 GMT

బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. తమ బంధం తెగదెంపులు అయితే దానిపై లోతుగా విశ్లేషణ చేస్తామన్నారు. రాబోయే ఉప ఎన్నికల కోసం తాము సిద్ధమవుతున్నామని, 11 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని అఖిలేష్ యాదవ్ తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కూటమి ఘోర విఫలమైన విషయం కావడంతో మహాఘటబంధన్‌లో లుకలుకలు మొదలయ్యాయి. అఖిలేష్ యాదవ్ ఆదేశాలను ఎస్పీ కేడర్ పాటించలేదని, ఆ పార్టీ నేతలు బీఎస్పీకి ఓట్లేయలేదని మాయావతి పేర్కొనడంతో ఎస్పీ-బీఎస్పీ బంధానికి బ్రేకులు పడ్డాయి.

  

Tags:    

Similar News