Social Media.. వైరల్గా మారిన రాజ్నాథ్ సింగ్ ఆయుధపూజ
-సోషల్ మీడియాలో వైరల్గా మారిన రాజ్నాథ్ సింగ్ ఆయుధపూజ -విజయదశమి సందర్భంగా ఫ్రాన్స్లో రాఫెల్ యుద్ధ విమానానికి పూజలు చేసిన రాజ్నాథ్ విమానంపై ఓం అని రాసి.. కొబ్బరి కాయ కొట్టి పూలతో పూజలు రాఫెల్ విమానం చక్రాల కింద నిమ్మకాయలు -సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన రాజ్నాథ్ సింగ్ ఆయుధపూజ -మూఢ నమ్మకాలను ప్రోత్సహించినట్టు ఉందని హేతువాదుల ప్రశ్న
విజయదశమి సందర్భంగా ఫ్రాన్స్లో రాఫెల్ యుద్ధ విమానానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పూజలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాశంమైంది. భారత వైమానిక దళం తరఫున దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిదాన్ని స్వీకరించేందుకు రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ వెళ్లిన విషయం తెలిసిందే. మూడు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాజ్నాథ్ సింగ్ రాఫెల్ తయారీదారు డసాల్ట్ ఏవియేషన్ ఫెసిలిటీ దగ్గర రాఫెల్ అప్పగించడాన్ని అంగీకరించారు. అధికారికంగా భారత్కు అందిన రాఫెల్ యుద్ధ విమానానికి దసరా సందర్భంగా ఆయుధపూజ నిర్వహించారు రాజ్ నాథ్.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా రాజ్నాథ్ ఆయుధ పుజలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆయుధపూజలో భాగంగా రాఫఎల్ యుద్ధవిమానంపై ఓం అని రాశారు. పువ్వులను ఉంచి .. కొబ్బరికాయ కొట్టారు. రెండు నిమ్మకాయలను యుద్ధ విమానం చక్రాల కింద ఉంచారు.
నిమ్మకాయ, మిరపకాలు కడితే చెడు జరగదని, దిష్టి తొలుగుతుందని కొందరు భావిస్తారు. దీనిని కొందరు మూఢ నమ్మకం అని కూడా అంటారు. అయితే రాజ్ నాథ్ సింగ్ ఆయుధ పూజ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశ రక్షణ మంత్రి పూజలు చేయడం మూఢ నమ్మకాలను ప్రోత్సహించడమేనని పలువురు అంటున్నారు. దేశాన్ని కాపడటానికి రాఫెల్ను భారత్ కొనుగోలు చేస్తే.. ఇప్పుడు రాఫెల్ను కాపడటానికి నిమ్మకాలను కొన్నారని కొందరు ఫేస్ బుక్లో కామెంట్స్ కూడా పెట్టారు.