పాకిస్థాన్లో క్వెట్టా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బాంబు పేలుళ్లలో 16 మంది మృతిచెందారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. హజర్గంజి సబ్జీ మండీ ప్రాంతంలో హజర్ కమ్యూనిటీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది.అత్యంత రద్దీగా ఉండే హజర్గంజీ కూరగాయల మార్కెట్లో ఉదయం ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు.