లండన్ బ్రిడ్జి వద్ద దుండగులు కత్తితో దాడి చేసిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇది ఉగ్రవాద దాడిగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తిని కాల్చి చంపారు. ఘటనా స్థలంలో చనిపోయిన వ్యక్తి దగ్గర ప్రమాదకరమైన పేలుడు పరికరాలు ఉన్నయని పోలీసులు వెల్లడించారు. బ్రిడ్జ్ వద్దకు చేరుకున్న దుండగుడు దాడికి యత్నించిన పలువరిని గాయపరిచాడు. దుండగులు దాడికి యత్నించిన వీడియోలు అక్కడి సీసీఫూటేజిలో ప్రసారమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పోలీసులు బిడ్డిను చుట్టుముట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వంతెన పై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని ఉస్మాన్ ఖాన్ గా గుర్తించారు.
Guardian front page, Saturday 30 November 2019: Two killed in London Bridge terror attack pic.twitter.com/0bZnTiJFZS
— The Guardian (@guardian) November 29, 2019