నవాజ్ షరీఫ్ కు ఊరట.. 4 వారాల పాటు బెయిల్ మంజూరు

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఊరట లభించింది. చికిత్స లండన్ వెళ్లేందుకు లాహోర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Update: 2019-11-17 04:21 GMT

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం అనుభవిస్తున్న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఊరట లభించింది. చికిత్స లండన్ వెళ్లేందుకు లాహోర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవాజ్ షరీఫ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంతో బాధపడుతున్నారు. నవాజ్ రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతున్నాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం లండన్ వెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో నవాజ్ షరీష్ తరుపున న్యాయవాది బెయిల్ కోసం కోర్టు అభ్యర్థించారు. దీంతో నాలుగు వారాలు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నామని చికిత్స అనంతరం తిరిగి స్వదేశానికి తిరిగి రావాలని కోర్టు స్పష్టం చేసింది.

కాగా విదేశాలకు వెళ్ళకుండా నిషేదం విధించిన జాబితా నుంచి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరును తొలిగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రెండు రోజుల్లో నవాజ్ షరీఫ్ లండన్ వెళ్లనున్నారు. షరీష్ ఆరోగ్యం కుదుటపడకపోతే మరింతకాలం కోర్టు గడువు పొడిగించే అవకాశాలు ఉన్నాయని ఆయన తరపున వాదించిన న్యాయవాది తెలిపారు.  

Tags:    

Similar News