బ్యాంకులకు 9వేల కోట్లు ఎగనామం పెట్టి బ్రిటన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అక్కడ లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నాడు. దీనిపై ఎస్బీఐ బ్రిటన్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. అతను వారానికి 18,300 పౌండ్లు ఖర్చు చేస్తుండగా, ఖర్చును నెలకు 29,500 పౌండ్లకు తగ్గించేందుకు అంగీకరించారని మాల్యా న్యాయవాది ఎస్బీఐకి తెలపడంతో ఎస్బీఐ ఈ అంశాన్ని బ్రిటన్ కోర్టుకు నివేదించింది. నివేదికలో మాల్యాకు చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ యూకే పీఎల్సీ ఖాతా నుంచి 2,58,000 పౌండ్లను సీజ్ చేసేలా అనుమతి ఇవ్వాలని కోర్టును ఎస్బీఐ కోరింది.