నేటి నుంచి ఆన్లైన్ లో ఏపీ ఇంటర్ ప్రవేశాలకు ఏర్పాటు

ఆన్లైన్ లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి.

Update: 2020-10-21 03:17 GMT

ఆన్ లైన్ లో ఇంటర్మీడియట్ ప్రవేశాలను ప్రారంభిస్తోంది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు. 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్ లో ప్రవేశాలు ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నారు. రెండేళ్ల ఇంటర్‌ కోర్సులు, ఒకేషనల్‌ కోర్సు్ల్లో ప్రవేశాలకు బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈనెల 29 వరకూ ఆన్లైన్ లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. bie.ap.gov.in వెబ్ సైట్ లో లాగిన్ అయి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రవేశాలకు సంబంధించి ఏదైనా సందేహాలు లేదా సమస్యలను తొల ఫ్రీ నెం 18002749866 కు ఫోన్ చేసి నివృతి చేసుకోవచ్చు. 

Tags:    

Similar News