RRB Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పదో తరగతి అర్హతతో రైల్వేలో 32,438 ఉద్యోగాలు
RRB Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు లెవల్ 1 పోస్టులకు సంబంధించి వివరణాత్మక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ కింద దాదాపు 32, 438 గ్రూప్ డి పోస్టులను భర్తీ చేయనున్నారు. పాయింట్స్ మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తో పాటు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అహ్మదాబాద్, అజ్ మేర్, బెంగళూరు, భోపాల్, బిలాస్ పూర్, భువనేశ్వర్, చండీగఢ్ , చెన్నై, గోరఖ్ పూర్, కోల్ కతా, మాల్దా, ముంబై, పట్నా , ప్రయాగ్ రాజ్, రాంచీ, సికింద్రాబాద్ రీజియన్లలో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఆర్ఆర్ బీ లెవల్ 1 గ్రూప్ డి పోస్టులన్నీ ఎస్ అండ్ టీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ ట్రాఫిక్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
పోస్టులు వివరాలు..
పాయింట్స్మన్ పోస్టుల సంఖ్య: 5,058
అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్) పోస్టుల సంఖ్య: 799
అసిస్టెంట్ (బ్రిడ్జ్) పోస్టుల సంఖ్య: 301
ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 పోస్టుల సంఖ్య: 13,187
అసిస్టెంట్ పీ-వే పోస్టుల సంఖ్య: 247
అసిస్టెంట్ (సీ అండ్ డబ్ల్యూ) పోస్టుల సంఖ్య: 2587
అసిస్టెంట్ లోకో షెడ్ (డిజిల్) పోస్టుల సంఖ్య: 420
అసిస్టెంట్ (వర్క్షాప్) పోస్టుల సంఖ్య: 3077
అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ) పోస్టుల సంఖ్య: 2012
అసిస్టెంట్ టీఆర్డీ పోస్టుల సంఖ్య: 1381
అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్) పోస్టుల సంఖ్య: 950
అసిస్టెంట్ ఆపరేషన్స్- (ఎలక్ట్రికల్) పోస్టుల సంఖ్య: 744
అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ పోస్టుల సంఖ్య: 1041
అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్షాప్) పోస్టుల సంఖ్య: 625
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి లేదా ఐటీఐ డిప్లామాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ లేదా సంబంధిత ట్రేడ్స్ లో ఐటీటీ చేసి ఉండాలి. నోటిఫికేషన్ లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 1, 2025 నాటికి 18ఏళ్ల నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుది.
ఆన్లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఆసక్తి ఉన్నఅభ్యర్థులు ఫిబ్రవరి 22, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించాలి. ఎంపికైన అభ్యర్థఉలకు నెలకు రూ.18,000తోపాటు ఇతర అలవెన్స్లు ఉంటాయి.