Stock Market: ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

Stock Market: 383 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Update: 2024-05-07 11:14 GMT

Stock Market: ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 383 పాయింట్లు నష్టపోయి 73వేల 511కి పడిపోయింది. నిఫ్టీ 140 పాయింట్లు కోల్పోయి 22వేల 302కి దిగజారింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌గా హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, టీసీఎస్, ఐటీసీ కంపెనీలు నిలవగా... టాప్ లూజర్స్‌గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ షేర్లు నిలించాయి.

Tags:    

Similar News