ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీలోని ఏపీ భవన్లో వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష రెండు రోజు కొనసాగుతోంది. రాజమోహన్రెడ్డి, సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, అవినాశ్రెడ్డి, వరప్రసాద్రావులు దీక్షలు చేస్తున్నారు. నిన్న ఢిల్లీలో వర్షం వచ్చినప్పటికీ వైసీపీ ఎంపీలు దీక్షను కంటిన్యూ చేస్తున్నారు. దీక్షలో ఉన్న నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హైబీపీ, తలనొప్పితో బాధపడుతున్న మేకపాటి వేదిక నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకున్నారు. దీంతో మేకపాటి రాజమోహన్రెడ్డిని రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.