పదవికి రాజీనామా చేస్తానంటూ వైసీపీ సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర సంచలన ప్రకటన చేశారు. సాలూరు
మండలం కరాసు వలసలో 15 రోజుల్లో 9 మంది జ్వరాలతో చనిపోయారు... వీటిపై వైసీపీ రాష్ట్ర, జిల్లా
నాయకులు నోరు ఎత్తడం లేదు..., అంతేగాక ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు.. అంటూ పేర్కొన్నారు.
అలాగే జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, మూడు రోజుల్లో అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం
స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’నంటూ ప్రకటించారు.