‘దేవుడు వైఎస్‌ జగన్‌ పక్షాన ఉన్నాడు’

Update: 2018-12-25 07:46 GMT

కడప జిల్లా పులివెందులలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సీఎస్ఐ చర్చిలో జరిగిన ఈ వేడుకల్లో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు సందేశం వినిపించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వైఎస్ విజయమ్మ.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పాదయాత్రలో నిత్యం దేవుడు జగన్ కు తోడుగా ఉండి కాపాడుతున్నాడని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు అందించిన సుపరిపాలనను జగన్ కూడా అందిస్తారని చెప్పారు. దేవుని ఆశీర్వాదం వల్ల వైఎస్ కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారని వ్యాఖ్యానించిన ఆమె, రాబోయే రోజుల్లో జగన్ లక్ష్యాన్ని దేవుడు నెరవేరుస్తాడని అన్నారు. వైఎస్ జగన్ కోసం ప్రార్థిస్తున్న కోట్లాది మందికి కృతజ్ఞతలు తెలిపారు విజయమ్మ.

Similar News