ఈనెల అరవతేదీన నిర్వహించతలపెట్టిన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర నేపథ్యంలో వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి నేడు తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు.. తాను చేసే పాదయాత్ర విజవంతకావాలని సర్వమత ప్రార్ధనలు చేస్తున్న అయన ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుని సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్తారని చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు గంగాధర నెల్లూరు శాసనసభ్యుడు నారాయణస్వామి వెల్లడించారు.. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డిల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేసారు