ఆస్పత్రి నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జ్

Update: 2018-10-26 07:40 GMT

సిటీ న్యూరో ఆస్పత్రి నుంచి వైసీపీ అధినేత జగన్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న విశాఖ ఎయిర్‌పోర్టులో దాడికి గురైన.. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందారు. శస్త్ర చికిత్స తర్వాత ఆయన్ని అబ్జర్వేషన్‌లో ఉంచారు. అయితే ఈ ఉదయం సిట్‌ అధికారులు ఆస్పత్రికి వచ్చి జగన్‌ స్టేట్‌ మెంట్‌ను రికార్డ్‌ చేశారు. తొలుత జగన్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వరని వైసీపీ నాయకులు చెప్పారు. అయితే చివరకు జరిగిన దాడిపై సిట్‌కు.. జగన్‌ తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసిన తర్వాత.. వెంటనే ఆయన్ని డిశ్చార్జ్‌ చేశారు. కాసేపట్లో ఆయన లోటస్‌ పాండ్‌కు చేరుకోనున్నారు. 

Similar News