అక్రమాస్తుల కేసుల విచారణలో భాగంగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం విచారణ జరుగుతున్న నేపధ్యంలో జగన్ పాదయాత్రకు విరామం ఇచ్చి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్, సబితా ఇంద్రారెడ్డి, బీపీ ఆచార్య తదితరులు కోర్టుకు హాజరయ్యారు. దాదాపుగా రెండు గంటల పాటు వారంతా కోర్టులోనే ఉన్నారు.