హోదా కోసం మరొకరు ప్రాణత్యాగం

Update: 2018-07-28 05:59 GMT

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్  చేస్తూ చిత్తూరు జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మదనపల్లె గౌతమినగర్ కు చెందిన సుధాకర్ చేనేత కార్మికుడుగా జీవినం సాగిస్తున్నాడు. అయితే, ప్రత్యేక హోదా రాలేదన్న ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్  నోట్  రాసి ఉరి వేసుకున్నాడు. హోదా కోసం బలిదానం చేసుకోవడం చిత్తూరు జిల్లాలో ఇది రెండో సంఘటన కాగా.. గతంలో నుకోటి అనే వ్యక్తి తిరుపతిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక సుధాకర్‌ ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేవాడని స్థానికులు తెలిపారు.

Similar News