చంద్రబాబు పాలనలో అవినీతి విశ్వవ్యాప్తమైందని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చేతికి వాచి, వేలికి ఉంగరం లేదంటూ ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు ...నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఎద్దేవా చేశారు. నవనిర్మాణ దీక్షతో ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు ఎయిర్ ఏసియా వివాదంలో తన ఆడియో టేప్ వెలుగుచూసినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.