#MeToo ఎఫెక్ట్: నన్నే వేధిస్తావా అంటూ చితకబాదింది

Update: 2018-10-16 05:28 GMT

‘మీటూ’ ఉద్యమం ప్రభావంతో బాధిత మహిళలు ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బహిర్గతం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా #MeToo ప్రకంపనలు రేపుతున్న తరుణంలో కర్ణాటకలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కర్ణాటక ఓ మహిళ శివంగిలా మారిపోయింది.  లోన్ కావాలని దేవనగెరెలోని ఓ బ్యాంకుకు వెళ్లిన మహిళ పట్ల బ్యాంక్‌ మేనేజర్‌ అసభ్యంగా మాట్లడటంతో పాటు  తాను చెప్పినట్లు చేయాలని వేధింపులకు దిగాడు. దీంతో ఆగ్రహించిన మహిళ నన్నే వేధిస్తావా అంటూ మేనేజర్‌ను కర్రతో చితకబాదింది. ఓ మహిళ లోన్ కావాలని దేవనగెరెలోని ఓ బ్యాంకుకు వెళ్లింది. అయితే బ్యాంకు మేనేజర్ లోన్ ఇస్తానని, అయితే తాను చెప్పినట్లు చేయాలని వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. బ్యాంకు బయటకు తీసుకువచ్చి మేనేజర్‌ను కర్రతో చితకబాదింది. ‘నన్నే వేధిస్తావా.. నీకెంత ధైర్యం.. మీ హెడ్ ఎవరు ఫోన్ చేయ్ అంటూ.. ఆడవాళ్లంటే అంత చులకనా నీకు’ అంటూ గద్దిస్తూ అతడిని మహిళ కొట్టసాగింది. అక్కడ గుమిగూడిన జనాలు తమ సెలఫోన్లకు పని చెప్పారు. ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

Similar News