ముంబై రైల్వే స్టేషన్లో ఓ నిండుగర్బిణికి తోటి మహిళా ప్రయాణీకులు కాన్పు చేశారు. తొమ్మిది నెలల నిండు గర్భిణి కాన్పు కోసం ఊరికి వెళ్లేందుకు స్టేషన్కు చేరుకుంది. టికెట్ కొనేందుకు భర్త వెళ్లడంతో లగేజ్తో పాటు ఫ్లాట్ఫాంపైనే కూర్చొంది. ఇంతలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. ప్రసవవేదన పడుతున్న అరుపులు విన్పించాయి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను చూసిన చుట్టుపక్కల మహిళా ప్రయాణికులు, రైల్వే మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని చీరలు అడ్డుగా ఉంచి ఫ్లాట్ఫాంపైనే సుఖ ప్రసవం చేశారు. డెలివరీ తర్వాత తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తల్లీబిడ్డలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ డెలివరీ కోసం సహకరించిన తోటిప్రయాణికులు, రైల్వే మహిళ పోలీసులను స్థానికులు పొగడ్తల్లో ముంచెత్తారు.