కోదాడ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లిన ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ కు షాక్ తగిలింది. కోదాడ తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన ఆయన పత్రాలను అధికారులకు సమర్పించారు. అయితే, అవి సరిగా లేకపోవడంతో నామినేష్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో, వేణుమాధవ్ తిరిగి వెళ్లిపోయారు. పూర్తిస్థాయిలో పత్రాలను సేకరించుకున్న తర్వాత శని లేదా ఆదివారాల్లో మళ్లీ తాను నామినేషన్ దాఖలు చేస్తానని ఈ సందర్భంగా వేణుమాధవ్ తెలిపారు. కోదాడ తన స్వస్థలం కావడంతో వేణుమాధవ్ అక్కడినుంచే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.