వైసీపీ హైకమాండ్ పై ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని... అయినా తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు కేటాయించారన్న వార్తల నేపథ్యంలో ఇవాళ తన సన్నిహితులతో రాధా సమావేశమయ్యారు. రాధాకు పార్టీ అన్యాయం చేసిందని రాధా వర్గీయులు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఐతే.. మూడు రోజులు ఓపిక పెట్టాలని వారికి రాధా సూచించారు. 'మనం ఇంకా పార్టీలోనే ఉన్నాం..అధిష్టానంతో మాట్లాడదాం' అని చెప్పారు. అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని రాధా తెలిపారు.