తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేదాకా సోనియా కాళ్లు కడిగి నెత్తిన వేసుకుంటానని తిరిగి మోసం చేశాడని మండిపడ్డారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతిపక్ష సభ్యులను, తెలంగాణ కవులు, కళాకారులను పిలవకుండా అవమానించాడన్నారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలో శవాలను పందికొక్కులు పీక్కుతినడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా నీ పాలన అంటూ కేసీఆర్ను నిలదీశారు వీహెచ్.