దేశానికే కేసీఆర్‌ నాయకత్వం దిక్సూచీ:కేటీఆర్‌

Update: 2018-12-20 15:19 GMT

ఇక నుంచి దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలకపాత్ర పోషించబోతున్నారని కేటీఆర్ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 16 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం మొత్తానికే కేసీఆర్‌ నాయకత్వం దిక్సూచిగా మారిందని కేటీఆర్‌ అన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలంటే కాంగ్రెస్, బీజేపీ లేని తృతీయ ప్రత్యామ్నాయంతోనే సాధ్యమని కెటిఆర్ స్పష్టం చేశారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా దూసుకెళ్లున్నాయని అందుకే ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని గుర్తించి, దేశం మొత్తం అబ్బురపడేలా 88 స్థానాలు కట్టబెట్టారని అన్నారు. 

Similar News