రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్పై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ కాంగ్రెస్ నాయకులతో బేరసారాలు జరిపారంటూ ఆరోపించారు. పార్టీకి డీఎస్ చీడపురుగుగా మారడం వల్లే జిల్లా నేతలంతా బహిష్కరించాలంటూ డిమాండ్ చేశామన్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని కాపాడుకునేందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నారంటూ విమర్శించారు.