తెలంగాణలో ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 43 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కంపు కొనసాగుతోంది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ ఆధిక్యంలో ఉండగా, జగిత్యాలలో ఎం.సంజయ్కుమార్ (టీఆర్ఎస్) ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.