తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హరీశ్‌రావు

Update: 2018-12-17 12:32 GMT

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో తన్నీరు హరీశ్‌ రావు భారీ ఆధిక్యంతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీతిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా సదర్శించుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకుపైగా భారీ మెజారిటీతో గెలుపొంది హరీశ్‌రావు సరికొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే తర్వలో ప్రకటించనున్న మంత్రివర్గంలో హరీశ్‌ రావుకు తాజాగా ఏ మంత్రిత్వశాఖ కేటాయిస్తారన్నది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.


 

Similar News