ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ బర్త్డే వేడుకలను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. చాలా ఏళ్లు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ వీరవనితగా చరిత్రలో నిలిచిపోతారన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోనియా పుట్టినరోజు సందర్భంగా ఆయన టి.పీసీసీ తరపున సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా సోనియా తృణప్రాయంగా వదిలిపెట్టారని చెప్పారు. ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చి పేదలకు అండగా నిలిచారన్నారు. దేశంలో ఎన్నో చట్టాలు తీసుకొచ్చిన ఘనత సోనియాదేనని కొనియాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడిలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.