థర్డ్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం. కేటీఆర్ను సీఎం చేయాలని ఆలోచనతోనే కేసీఆర్ జాతీయ నాయకుడిగా ఎదగాలని చూస్తున్నారని అది కరెక్ట్ కాదని చెప్పారు. త్వరలోనే తమ పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు కోదండరాం. అమరవీరుల స్ఫూర్తితో ఈ నెల 10న హైదరాబాద్ లో జరిగే మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు