మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. శనివారం రాత్రి ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబుతో పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, సీసీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్కి 90, టీజేఎస్కి 9, టీడీపీకి 15, సీపీఐకి 5 సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు.