క్యూలో అల్లు అర్జున్, ఓటు హక్కును వినియోగించుకున్న పీవీ సింధు, రాజమౌళి

Update: 2018-12-07 02:30 GMT

హైదరాబాద్‌లో పలుచోట్ల ఇంకా పోలింగ్‌ ప్రారంభం కాలేదు. ఏజెంట్లు ఆలస్యంగా రావడం, వీవీప్యాట్‌, ఈవీఎంలో సమస్యలు తలెత్తడంతో ఇంకా కొన్ని చోట్ల పోలింగ్‌ ప్రారంభం కాలేదు. కాగా ఉదయం 7:40 జూబ్లీహిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, దర్శకుడు రాజమౌళి. అలాగే కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డారు సినీనటుడు అల్లు అర్జున్.  

Similar News