చంద్రబాబుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Update: 2018-12-01 10:45 GMT

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో నాటకాలాడినందుకే అమరావతికి తరిమికొట్టామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.  తన శక్తిని అతిగా ఊహించుకుంటున్న చంద్రబాబుకు సమయం వచ్చినప్పుడు ఎలా బుద్ధి చెప్పాల్లో తమకు తెలుసన్నారు. అవసరమైతే ఏపీ రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటామన్న కేటీఆర్‌  అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికింది నీవు  కాదా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఆడియో టేపుల్లో ఉన్న బ్రీఫ్‌డ్ మీ వాయిస్ తనది కాదని చంద్రబాబు చెప్పగలరా ? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు.  ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కులాల పేరిట చిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణ సమాజం తగ్గిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.  నందమూరి కుటుంబం మీద నిజంగా ప్రేమ ఉంటే లోకేష్‌కు ఇచ్చినట్టు సుహాసిని కి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నాలుగు బిల్డింగ్‌లు కట్టి హైదరాబాద్‌ను నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు, ఎన్నికల తరువాత రాహుల్‌తో కలిసి ఫిడేల్ వాయించుకోవాల్సిందేనంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. 

Similar News