వై.ఎస్. జగన్ పై టీడీపీ ఎంపీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ హత్యాయత్నం నాటకం చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. కత్తి దాడి ద్వారా సానుభూతి పొందాలనుకుంటున్నారని చెప్పారు. కోడి కత్తి ద్వారా ఆదరణ పొందాలనుకున్నజగన్ నాటకం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. హత్యా రాజకీయాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. జగన్ పై జరిగిన దాడి కేవలం ప్రజల్లో సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.