కాసేపట్లో జనసేనలోకి రావెల కిషోర్ బాబు..

Update: 2018-12-01 04:05 GMT

మాజీ మంత్రి రావెలకిషోర్‌బాబు ఇవాళ పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. నాగర్జున యూనివర్శిటీ నుంచి అభిమానులతో ర్యాలీగా గుంటూరుకు వెళ్లి అనంతరం, జనసేన అధినేత సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పత్తిపాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రావెల ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి రాజీనామా లేఖ పంపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రావెల రాజీనామా  చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల.. చంద్రబాబు మంత్రివర్గంలో మూడేళ్లు పనిచేశారు. 

Similar News