ట్విట్టర్‌లో జగన్ పై లోకేష్ సెటైర్లు

Update: 2018-06-12 08:48 GMT

సహజ వనరులను దోచుకుంటున్నారని జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని.. ఏపీ మంత్రి లోకేష్ ట్విట్టర్‌లో విమర్శించారు.. అసలు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న తర్వాత ఏమైనా మిగిలిందా అంటూ సెటైర్లు వేసిన లోకేష్... జగన్ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లుగా సహజ ఖనిజాలైన.. బాక్సైట్, లైమ్ స్టోన్ తిన్నాడన్నారు.. నీ మీద ఉన్న 13 ఛార్జ్ షీట్లలో నువ్వు దోచుకున్న మెనూ మొత్తం ఉందని ఒక్కసారి చూసుకో.. అంటూ విమర్శించారు.. రాష్ట్రంలో సహజవనరులను సీఎం, లోకేష్‌తో పాటు, టీడీపీ నేతలు దోపిడీ చేసి, దాచుకుంటున్నారంటూ ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర సందర్భంగా నిన్న జరిగిన సభలో ఆరోపించిన విషయం తెలిసిందే.

Similar News