తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్ను శాశ్వతంగా మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి కాలుష్యం ఏర్పడుతోందని స్థానికులు నెలల తరబడి ఆందోళన నిర్వహించారు. వారం రోజుల క్రితం జరిగిన ఆందోళనపై పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తమిళనాడు ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో స్టెరిలైట్ ప్లాంట్ ను శాశ్వతంగా మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.