ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఏర్పేడు ఎస్ఐ వెంకట రమణ గుండెపోటుతో మృతి చెందారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోవడంతో సహచరులు హుటాహుటిన నారాయణాద్రి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.