జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యాడు. పోలీసుల కస్టడీలో ఉన్న శ్రీనివాసరావును మూడో రోజు విచారిస్తున్నారు. అయితే, ఉదయం నుంచి నీరసంగా ఉండటంతో పాటు ఛాతీలో నొప్పితో ఇబ్బందిపడుతున్నట్టు తెలుస్తోంది. మొదట శ్రీనివాసరావుకి ఫస్ట్ ఎయిడ్ నిర్వహించిన పోలీసులు.. జీపులో కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.