సంచార జాతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అసెంబ్లీ స్పీకర్ మధుసూదన చారి. జయశంకర్ భూపాలపల్లిలో పూసల ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు. గాజుల గంపను ఎత్తుకొని గాజులు, గాజులు అంటూ సభికులను స్పీకర్ ఉత్తేజపరిచారు. సంచార జాతుల వృద్ధితోనే ప్రభుత్వ ప్రగతి సాధ్యమవు తుందని, రాష్ట్రంలో వివిధ కులాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా పూసల కులస్థులకు చెందిన గాజుల గంపను స్పీకర్ మధుసూదనాచారి ఎత్తుకున్నారు.