అనూహ్యంగా భూపాలపల్లిలో స్పీకర్ మధు సూదనాచారి వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర రమణారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండవ రౌండు పూర్తి అయ్యే సరికి మధుసూదనాచారిపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర రమణారెడ్డి 843 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికి టీఆర్ఎస్ 85, కాంగ్రెస్ 13, ఎమ్ఐఎమ్, బీజేపీ, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క లాంటి నేతలు వెనుకబడ్డారు.