అష్టదిగ్బంధంలో శబరిమల అయ్యప్ప ఆలయం

Update: 2018-08-21 04:13 GMT

కేరళలోని సుప్రసిద్ధ దేవాలయం శబరిమల వరుణుడి అష్టదిగ్బంధంలో కొనసాగుతోంది. శబరికి చేరుకునే మార్గాలన్నింటినీ భారీ వర్షాలు కుదిపేశాయి. చాలాచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. పంబా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో శబరిమలకు చేరే దారులన్ని మూసుకుపోయాయి. ఈ నెల 14న నిరుపతరి ప్రత్యేక పూజల సందర్భంగా గుడికి వెళ్లే దారిలేక ప్రధాన అర్చకుడు అయ్యప్ప సన్నిధిలో ఉన్న అర్చకుడితో ఫోన్‌లో మాట్లాడి నిరుపతరి తంతును ముగించేశారు. శబరిమలను చేరేందుకు ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు మార్గాలూ జల దిగ్బంధంలో ఉన్నాయి. శని, ఆదివారాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 23 నుంచి 27 వరకు భక్తులను శబరికొండకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి. 
 

Similar News