ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలోనే ఓ అధికారి మసాజ్ చేయించుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. అదే కార్యాలయంలో పని చేసే తోటమాలితో మసాజ్ చేయించుకోవడం విశేషం. లైసెన్స్ల కోసం కార్యాలయానికి వచ్చిన వారు దీనిని ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)గా పనిస్తున్న సురేష్రెడ్డి తన సీట్లోనే కూర్చుని బనియన్పై కిందిస్థాయి సిబ్బందితో మసాజ్ చేయించుకుంటుండటాన్ని గుర్తించిన కొందరు వ్యక్తులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో ఉంచారు.