కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి నుండి కడప వస్తున్న ఆర్టీసీ బస్సును గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో లారీ ఢొకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా పడగా అదుపు తప్పి లారీ లోయ అంచున నిలిచిపోయింది. ఇంతలోనే ఎదురుగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి బస్సుకు, ఘాట్ రోడ్డు వాల్కు మధ్య ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.