ఏవోబీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలోనే అరకు దాడి...అరుణ నేతృత్వంలోనే అరకు ఆపరేషన్‌

Update: 2018-09-24 09:49 GMT

ఏవోబీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలోనే అరుకు దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఏవోబీ రాష్ట్ర కమిటీ మెంబర్‌గా ఉన్న అరుణ.. దాడికి పది రోజుల క్రితమే అరుకు ఏరియాకు వచ్చినట్టు పోలీసులు సమాచారం సేకరించారు. మహిళా దళానికి నేతృత్వం వహిస్తున్న అరుణ... పక్కా వ్యూహంతో దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఏవోబీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న అక్కిరాజు హరగోపాల్‌... అలియాస్‌ ఆర్కే ఆదేశాలతోనే ఎమ్మెల్యే సర్వేశ్వర్రావ్, మాజీ ఎమ్మెల్యే సోమలను అరుణ దళం కాల్చి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

Similar News