ఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

Update: 2018-11-17 10:15 GMT

తన నామినేషన్‌ ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈసీని ఆశ్రయించారు. సీఎం కేసీఆర్ ఒత్తిడితో అధికారులు తన ర్యాలీకి అనుమతి నిరాకరిస్తున్నారంటూ ఆదనపు ఎన్నికల కమిషనర్‌ జ్యోతి బుద్ద ప్రకాష్‌కు ఫిర్యాదు చేశారు. తాను అనుమతి కోరితే శాంతి భద్రతలు అంటున్న అధికారులు ఇతర పార్టీల నేతలకు మాత్రం అడిగిందే తడవుగా అనుమతులు ఇస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకోవాలంటూ ఆయన కోరారు.   
 

Similar News