న‌న్నుచూస్తే ప్ర‌భుత్వ‌మే పారిపోతుంది

Update: 2018-01-13 12:58 GMT

విద్యుత్‌పై చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోయిందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. తనని రవ్వంత అంటున్న టీఆర్ఎస్‌ నేతలు...మీ అవినీతి కొంప తగలబెట్టడానికి ఆ రవ్వే చాలన్నారు. విభజన సమయంలో జనాభా ప్రాతిపదికన విద్యుత్‌ కేటాయింపులు చేసి ఉంటే....తెలంగాణకు నష్టం జరిగేదన్నారు రేవంత్‌రెడ్డి. సోనియా గాంధీ విచక్షణతో వ్యవహరించి వినియోగం ప్రాతిపదికన కేటాయింపులు చేశారన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టి జైలు పెడతామంటున్న కేసీఆర్‌....తన ఆరోపణలను ఆధారాలతో సహా బయట పెడుతున్నానని...తప్పైతే కేసు పెట్టాలని రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.
 

Similar News